ఓటీటీ ప్లాట్ ఫామ్ ను ప్రారంభించిన ఆర్జీవీ

కరోనా కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. ఈ క్రమంలో ఓటీటీ ప్లాట్ ఫామ్ లకు ఆదరణ లభిస్తోంది. కొత్త కొత్త ఓటీటీలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఓటీటీ ప్రారంభించనున్నట్టు ప్రకటించాడు. ఇంతకుముందు సొంత ఏటీటీ అంటూ సందడి చేసిన ఆర్జీవీ ఇప్పుడు ప్రముఖ టీవీ హోస్ట్ స్వప్న, వ్యాపారవేత్త సాగర్ మచనూరు సహకారంతో స్పార్క్ పేరుతో ఓటీటీ ప్లాట్ ఫామ్ ను ప్రారంభించారు. దీని ద్వారా ప్రజలకు మరింత వినోదం పంచే ప్రయత్నం చేయబోతున్నాం అని వర్మ తెలిపారు. అయితే వీరి ప్రయత్నానికి ప్రభాస్, అడివి శేష్ తమ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. మే 15 నుంచి స్పార్క్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.