కృష్ణమ్మకు వరద ఉధృతి

విజయవాడ: కృష్ణమ్మకు వరద ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజి వద్ద 3 టిఎంసిల నీరు ఉంది. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద నీటిని బట్టి బ్యారేజీ గేట్లను ఎత్తే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. నిన్న అర్ధరాత్రి నుంచి వివిధ ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. విజయవాడతోపాటు కృష్ణా జిల్లాలో అనేక చోట్ల వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. రాకపోకలకు ప్రజలు తీవ్ర అవస్థలుపడ్డారు. విజయవాడలోని ప్రధాన రహదారుల్లో మోకాలు లోతు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ఇదిలా ఉండగా.. ఈ వర్షాల వల్ల పంటలకు మేలు జరుగుతుందని రైతులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.