ఔరంగబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదం దురదృష్టకరం – తగరపు శ్రీనివాస్

హుస్నాబాద్ నియోజకవర్గం, అక్కన్నపేట మండలం, చౌటపల్లి గ్రామంలో ఇటీవల ఔరంగబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఎరుకల కృష్ణ, సంజు, సురేష్, వాసులు మరణించగా వారి చిత్రపటానికి జనసేన పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ తగరపు శ్రీనివాస్ పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి, అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరి వెంట హుస్నాబాద్ మండల ఉపాధ్యక్షులు కొలుగూరి అనిల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ వొద్దమల్ల విజయ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.