లోకం మాధవి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా రుద్రాభిషేకం

నెల్లిమర్ల, మహాశివరాత్రిని పురస్కరించుకొని నెల్లిమర్ల నియోజకవర్గంలోని రామ తీర్థాలలో ఉమ్మడి తెలుగుదేశం జనసేన పార్టీల అభ్యర్థి అయిన శ్రీమతి లోకం మాధవి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మహా రుద్రాభిషేకం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల నియోజకవర్గం నలుమూలల నుండి అలానే విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాల నుండి భక్తులు విచ్చేసి రుద్రాభిషేకాన్ని తిలకించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సుమారు 5 వేలమంది భక్తులకి అన్న ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో లోకం మాధవి నియోజకవర్గంలో చేసిన పలు కార్యక్రమాల గురించి ఎల్.ఈ.డి స్క్రీన్ పై వేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ రుద్రాభిషేకం ఆవరణలో పలు పంచాయతీలు నుండి వచ్చిన కోలన్నను చూసి ప్రజలు తిలకించారు. ప్రాంగణమంతా జనసేన జెండాలతో, జనసేన నినాదాలతో జనసైనికులు మరియు లోకం మాధవి అభిమానులు సందడి చేశారు.ప్రజలు మాట్లాడుతూ లోకం మాధవి వచ్చే ఎన్నికల్లో తప్పక గెలుస్తారని, ఆ శివుడే ఆమెకు తోడుగా ఉన్నారని ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్రీమతి లోకం మాధవికి ధన్యవాదములు అని తెలియజేశారు.