మక్కువ టౌన్ లో జనసెన మెగా హెల్త్ క్యాంప్

సాలూరు నియోజకవర్గం, మక్కువ మండలంలో శుక్రవారం మండల నాయకులు గేదెల రిషవర్ధన్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ మక్కువ టౌన్ లో ఏర్పాటు చేశారు. అలాగే జనసైనికులతో ప్రజా సమస్యల దృష్ట్యా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. మండల నాయకులు గేదెల రిషివర్ధన్ మాట్లాడుతూ జనసేన అభివృద్ధి ద్యేయంగా జనసేన జండా మక్కువలో బలంగా ఎగిరేటట్టు బాధ్యత వహిస్తానని అన్నారు. అలాగే జనసేన కార్యకర్తలకు ఏటువంటి ఇబ్బంది కలిగినా ఎవరితోనైన సమస్యలు ఎదుర్కొన్న నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా జనసేన రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు, ఉత్తరాంధ్ర మహిళా రిజనల్ కోఆర్డినేటర్ తుమ్మి లక్ష్మీ రాజ్, గిరిజన నాయుకులు తుమ్మి అప్పలరాజు దొర, దళిత సత్తా అధ్యక్షులు రేగిడి లక్ష్మణరావు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.