పాలకులు రాజ్యాంగ ధర్మం ఆచరించేలా ప్రతీపౌరుడు బాధ్యత తీసుకోవాలి – మాదాల శ్రీరాములు

అరకు నియోజకవర్గం, 26 నవంబర్ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం జనసేన పార్టీ అరకులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్థంభమైన భారత రాజ్యాంగం పార్లమెంట్ లో ఆమోదం పొంది నవంబర్ 26 నాటికి డెబ్బైఏళ్లు నిండాయని, దేశానికి దశ దిశల్ని చూపిస్తూ ముందుకు నడిపిస్తున్న రాజ్యాంగం ఇప్పుడు రాష్ట్రాన్ని పాలిస్తున్న పాలకులు నిర్వీర్యం చేస్తున్నారని, పాలకులు రాజ్యాంగ ధర్మం ఆచరించేలా ప్రతీ పౌరుడు బాధ్యత తీసుకొని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని కోరారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కొనెడి లక్ష్మణ్ రావు ప్రసాద్ రామదాసు రాజు తదితరులు పాల్గొన్నారు.