చీమలపాడు దుర్ఘటన అత్యంత దురదృష్టకరం: పవన్ కళ్యాణ్

ఖమ్మం జిల్లా, కారేపల్లి మండలం, చీమలపాడులో బుధవారం చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం అత్యంత దురదృష్టకరం. బాణాసంచా నిప్పు రవ్వలు పడి పూరిల్లు అంటుకోవడం, ప్రమాదాన్ని నివారించే సమయంలో గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మరణించడం, మరో పదకొండు మంది తీవ్రంగా గాయపడడం చాలా దుఃఖదాయకం. ఈ ప్రమాదం, గాయపడిన బాధితుల దృశ్యాలు భయానకంగా గోచరిస్తున్నాయి. ప్రమాదంలో అశువులు బాసినవారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబాలకు సానుభూతి తెలియచేస్తున్నాను. ప్రాణ నష్టం పూడ్చలేనిది. మృతుల కుటుంబాలను ఆర్ధికంగా అన్ని విధాలా ఆదుకోవాలి. శరీర అవయవాలు కోల్పోయిన క్షతగాత్రులకు ప్రభుత్వం అత్యంత మెరుగైన వైద్య సహాయం అందించడంతోపాటు వారికి జీవితాంతం అండగా నిలబడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.