నాదెండ్లను మర్యాదపూర్వకంగా కలిసిన సంపత్ నాయక్

వైరా నియోజకవర్గం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ స్పీకర్, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను మంగళవారం జనసేన పార్టీ వైరా నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ సంపత్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా త్వరలో వైరా నియోజకవర్గం వైరాలో జనసేన పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ కి ఆహ్వానించడం జరిగింది.