చీరాల జనసేన యువత ఆత్మీయ సమావేశం

చీరాల నియోజకవర్గంలో జనసేన పార్టీ సానుభూతి పరులను పార్టీ కార్యక్రమలలో ఏవిధంగా భాగస్వాములను చెయ్యాలి అనే విధానంలో భాగంగా ఆదివారం చీరాల పట్టణంలోని వైకుంఠ పురం-దండుబాటు కాలనీలలో ఉన్న జనసేన కార్యకర్తలను స్థానిక జనసేన నాయకుడు గొర్ల రఘు ఆధ్వర్యంలో పసుపులేటి సాయి మరియు వరం బూడిద కలవడం జరిగింది. ఈ సందర్భంగా పసుపులేటి సాయి మరియు వరం బూడిద మాట్లాడుతూ గత 160 రోజులుగా జనసేన పార్టీ చీరాల నియోజకవర్గ యువత ఆధ్వర్యంలో పార్టీని బలోపతం చేసే విధంగా చేస్తున్న కార్యక్రమాలను వివరిస్తూ అందులో మీరు ఖచ్చితంగా భాగస్వాములు కావాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక యువత స్పందిస్తూ సోమవారం నుంచి శనివారం వరకు వ్యక్తిగత వృత్తుల్లో బిజీగా ఉంటాము అని చెప్పడం జరిగినది. ఈ సందర్భంగా పసుపులేటి సాయి మరియు వరం బూడిద మాట్లాడుతూ చీరాల నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యక్రమాలను ప్రణాళిక బద్ధకంగా రెండు భాగాలుగా (వారాలలో, వారాంతం లలో) విభజించడం జరిగింది. వారికి ఉన్న అందుబాటు ప్రకారం ప్రతీ ఆదివారం రోజు జరిగే గ్రామ గ్రామానికి జనసేన మేనిఫెస్టో సిద్ధాంతాల పరిచయ కార్యక్రమంలో ఈ ప్రాంతంలోని యువత అంతా భాగస్వాములు కావాలని చెప్పడం జరిగింది. దీనికి స్పందనగా స్థానిక యువత ప్రతీ ఆదివారం రోజు జరిగే గ్రామ గ్రామానికి జనసేన మేనిఫెస్టో మరియు సిద్ధాంతాల పరిచయ కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొంటామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పందిళ్ళపల్లి జనసైనికుడు భార్గవ్ మరియు స్థానిక జనసేన కార్యకర్తలు వి. రవి, కె.వాసు, ఎం. రమేష్, ఎల్. రవి, ఎల్. మణి, ఏ. శివాజీ, పి. విజయ్ పాల్గొన్నారు.