నిరుపేద కుటుంబానికి అండగా జనసేన

బాపట్ల మండలం కంకటపాలెం గ్రామస్తులు రాసూరి ఏడుకొండలు భార్య హఠాత్తుగా మరణించడంతో వారి కుటుంబానికి బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ తరపున గుంటూరు జిల్లా కార్యదర్శి గుంటుపల్లి తులసీ కుమారి మరియు బాపట్ల మండలం అధ్యక్షులు ముప్పర్తి శేషయ్య, ఉపాధ్యక్షులు పొట్ల అమరేంద్ర మరియు రాము కలిసి జనసేన, పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియపరచి, పెద కర్మ నిర్వహించడానికి కావలసిన బియ్యం & సరుకులు సహాయం చేయడం జరిగింది. వారి కుటుంబానికి ఏ సమస్య వచ్చినా మన జనసేన పార్టీ అండగా ఉంటుందని గుంటుపల్లి తులసీ కుమారి మరియు మండల అధ్యక్షులు ముప్పర్తి శేషయ్య హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులైన కంకటపాలెం జనసైనికులకు, గ్రామ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసారు.