వెంకయ్య నాయుడుని మర్యాదపూర్వకంగా కలిసిన సర్వేపల్లి జనసేన నాయకులు

  • వెంకటాచలం మండల వాసి పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుని మర్యాదపూర్వకంగా వెళ్లి కలిసిన సర్వేపల్లి జనసేన పార్టీ నాయకులు

జిల్లా పర్యటలో భాగంగా నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ నందు ఉన్న పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని శుక్రవారం జనసేన పార్టీ నాయకులతో కలిసి సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మర్యాదపూర్వకంగా వెళ్లి కలిశారు. ఈ సందర్బంగా వెంకయ్య నాయుడు గారికి శాలువాతో సన్మానించి, మొక్కను అందజేశారు. వెంకయ్య నాయుడు గారిని కలిసిన వారిలో సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి భవాని, పినిసెట్టి మల్లికార్జున్, సందూరి శ్రీహరి, బోలా అశోక్, సుమన్ తదితరులున్నారు.