రాజోలు జనసేన ఆధ్వర్యంలో వాటర్ ట్యాంకర్

కోనసీమ జిల్లా, రాజోలు, జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో ఏర్పటుచేసిన వాటర్ ట్యాంకర్ ద్వారా శుక్రవారం అంతర్వేది దేవస్దానం పంచాయితి పరిధిలో కొత్తవారి గ్రూప్ లో నీరు అందక ఇబ్బందులు పడుతున్న వారికి మోరిపోడుకు చెందిన క్రీ.శే. అడ్డాల రాజు జ్ఞాపకార్దం వారి కుమారులు శివనాయుడు రాజేష్ నాయుడుల ట్రాక్టర్ డీజల్ ఖర్చుల్కు ఆర్ధిక సహకారం అందించగా అంతర్వేది దేవస్దానం జనసైనికుల ద్వారా త్రాగునీరు అందించడం జరిగింది. ఈ కర్యక్రమంలో ఎంపిటిసి బైరా నాగరాజు మరియు జనసైనికులు పాల్గొన్నారు అని జనసేన నాయకులు నామన నాగభూషణం తెలిపారు.