రోడ్లపై వరి నాట్లతో సర్వేపల్లి జనసేన-టిడిపి నిరసన

సర్వేపల్లి, జనసేన-టీడీపీ పార్టీల పిలుపుమేరకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచనల మేరకు వెంకటాచలం మండలంలో మరమ్మతులకు గురై గుంటలు ఏర్పడి దెబ్బతిన్న కనుపూరు – చౌటపాలెం రోడ్డుపై శనివారం జనసేన, టీడీపీ పార్టీ నాయకులతో కలిసి వరి నాట్లు నాటి నిరసన తెలిపిన జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయ బాద్యులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, టీడీపీ వెంకటాచలం మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్, తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావూరి రాధాకృష్ణ నాయుడు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇప్పటివరకు రోడ్లుపై ఏర్పడిన గుంటలలో తట్టెడు మట్టి వెయ్యలేదు. రాష్ట్ర ప్రజల తరఫున ఇప్పటికే పలుమార్లు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు జనసేన పార్టీ నివేదికల రూపంలో రోడ్ల దయనీయస్థితి, అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం అంటే దేశ స్థాయిలో ఒక మంచి గుర్తింపు ఉంది. అందుకు కారణం పూర్వపు ఉపరాష్ట్రపతి పెద్దలు ముప్పరపు వెంకయ్య నాయుడు సొంత మండలం కావడంతో అలాంటి మండలంలో వెంకయ్య నాయుడు సొంత గ్రామానికి వెళ్లే రోడ్డే గుంటలతో దారుణంగా తయారైంది. సర్వేపల్లి ప్రజలు రెండుసార్లు కాకాని గోవర్ధన్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించగా ఆయన మాత్రం ప్రజలకు చేసింది ఏమీ లేదు. మరమ్మత్తులో గురై అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను బాగు చేయించడానికి వైసీపీ ప్రభుత్వం వద్ద డబ్బులు లేకుంటే సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రావెల్ అమ్మిన డబ్బులు ఎక్కడికి వెళ్లాయి. ఆ గ్రావెల్ డబ్బులను రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల కోసం ఖర్చు పెట్టడానికి ఎత్తి పెట్టుకున్నారా? మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా రాబోయే ఎన్నికల్లో డిపాజిట్లు లేకుండా ఓడిపోవడం ఖాయం. జనసేన-టీడీపీ పార్టీలు కలిసి రాబోయే ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల నాయకులు శ్రీహరి, కాజా, అశోక్, మల్లి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.