ప్రమదానికి గురైన జనసైనికుడికి ఆర్ధిక సాయం చేసిన సత్యవేడు జనసైనికులు

సత్యవేడు నియోజకవర్గం B.N కండ్రిగ మండలం కలివెట్టు గ్రామానికి చెందిన జనసైనికుడు గుణశేఖర్ కి ఆక్సిడెంట్ అయ్యి తీవ్రగాయాలయ్యాయి. ఆదివారం జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కొప్పల లావణ్యకుమార్ మరియు నియోజకవర్గం నాయకుడు హేమసుందరం హాస్పిటల్ కి వెళ్లి గుణశేఖర్ ని చూడడం జరిగింది. అనంతరం వారి కుటుంబసభ్యులతో మాట్లాడం జరిగింది. జనసేన పార్టీ తరపున 10 వేల ఆర్థికసాయం చేయటం జరిగింది. భవిష్యత్తులో అతనికి అన్నివిధాలా సాయపడతామని వారికి దైర్యం చెప్పడం జరిగింది. అలాగే బైక్ మీద వెళ్లేప్పుడు హెల్మెట్ పెట్టుకొవాలని రోడ్లు గుంతలుగా ఉండడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని, జనసైనికులు బయటకు వెళ్లేప్పుడు జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా వారు కోరడం జరిగింది.