జనసేన ఆధ్వర్యంలో సేవ్ ధర్మవరం కార్యక్రమం

ధర్మవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్మవరం పట్టణంలోని ఎల్1, ఎల్2, ఎల్3 కాలనీలో నిర్వహించడం జరిగింది. జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం కాలనీలో పర్యటిస్తున్న క్రమంలో ఎల్2 కాలనీ వాసులు స్మశాన వాటిక కోసం ఇక్కడ స్థలం లేదని దయచేసి ఇక్కడ స్థలం ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే కాలనీలో ఎక్కడ రోడ్లు బాగోలేదని వాపోయారు. తప్పకుండా జనసేన, టిడిపి పార్టీ అధికారంలోకి రాగానే వారి యొక్క సమస్యలన్నీ తీరుస్తానని వారికి హామీ ఇచ్చి ధర్మవరంలో రౌడీ రాజ్యాన్ని పోగొట్టి ఈ వైసీపీ పాలనను అంతమోందించేందుకు ధర్మవరం నియోజకవర్గ ప్రజలంతా సహకరించి రాబోయే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం పార్టీనీ గెలిపించాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సుగుణమ్మ, మహేష్, కుల్లయప్ప, మరియు జనసేన పార్టీ నాయకులు మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు, ధర్మవరం రూరల్ కన్వీనర్ నాగ సుధాకర్ రెడ్డి, కార్యనిర్వాహణ కమిటీ సభ్యులు రాజ్ ప్రకాష్, చిలకల సుధాకర్, ఆది, గొట్లురు జీవి, కొటికి రామాంజి, ప్యాదింది వెంకటేష్, కడపల సుధాకర్ రెడ్డి, బాలకృష్ణ, మల్లేమీద మోహన్ నాయుడు, నీలురు లక్ష్మీనారాయణ, శివ శంకర్, రాజేష్, కుమార్ స్వామి, ఆది, వన్ను శ్రీరాములు, మిరియాల లక్ష్మీనారాయణ, కోలా నాగార్జున, టి. ప్రతాప్, ధారా గంగాధర్, బాషా, చిలకం సుధాకర్ రెడ్డి, మరియు సాకే నరసింహులు, కే.రాజేష్, మిరపగారి శంకర, పుల్లంపల్లి రమేష్, అన్వర్, జయరాం రెడ్డి, నత్తి శ్రీరామ్ రెడ్డి, లోకేశ్, బిల్లే నందా మరియు తదితరులు పాల్గొన్నారు.