‘సేవ్ మున్సిపాలిటీ – సేవ్ పబ్లిక్ మనీ ‘

డా.బి ఆర్ అంబేద్కర్ కోనసీమ, అమలాపురం పుర పాలక సాధారణ సమావేశం ఛైర్ పర్సన్ రెడ్డి సత్య నాగేంద్ర మణి అధ్యక్షతన జరిగింది. సేవ్ మున్సిపాలిటీ – సేవ్ పబ్లిక్ మనీ అనే నినాదంతో జనసేన పార్టీ కౌన్సిల్ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. కంపోస్ట్ యార్డ్ లో చెత్త తొలగింపు అంటూ ప్రతి నెల 5లక్షలు కేటా ఇస్తున్నారన్నది దారుణమని ప్రతి పక్ష జనసేన నేత యేడిద వెంకట సుబ్రాహ్మణ్యం ప్రశ్నించారు. ఎన్ని లక్షలు కంపోస్ట్ యార్డ్ కు కేటా ఇస్తారంటూ జనసేన కౌన్సిలర్ పిండి అమరావతి మండి పడ్డారు. దీనిపై అధికార పార్టీ కౌన్సిలర్ గొవ్వాల రాజేష్ సమాధానమిస్తూ అక్కడ పరిస్థితిని బట్టి కేటాయిస్తున్నామని, పూర్తి స్థాయిలో కంపోస్ట్ యార్డ్ ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. జనసేన కౌన్సిలర్ లు గండి దేవి హరిక, గొలకోటి విజయలక్ష్మి, పడాల శ్రీదేవి, తిక్కా సత్యలక్ష్మి పాల్గొన్నారు.