SBI కొత్త రూల్స్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వినియోగదారుల కోసం నియమాలు మార్చింది. మీరు ఎస్ బిఐ వినియోగదారులు అయితే ఈ వారం నుంచే అమలులోకి రానున్న నియమాలు తప్పకుండా తెలుసుకోండి. ఈ రూల్స్ లో ఏటీయం నుంచి డబ్బులు తీయడం నుంచి, మినిమం బ్యాలెన్స్, ఎసెమ్మెస్ చార్జీలు వంటి అంశాల్లో కీలక మార్పులు ఉన్నాయి.

1: ఎస్ బిఐ జూలై 1వ తేదీ నుంచి తమ ఏటియం నియమాలను మార్చింది. ఈ నియమాలను పాటించకుంటే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. SBI తన అధికారిక వెబ్ సైట్ sbi.co.inలో అందుబాటులో ఉంచిన వివరాల ప్రకారం…సేవింగ్ ఖాతా ఉన్న వాళ్లు ATM నుంచి నెలకు 8 ఉచిత లావాదేవీలు మాత్రమే చేయగలరు. 9వ ట్రాన్సాక్షన్ నుంచి రూ.10+GST నుంచి రూ.20+GST చార్జ్ చేసే అవకాశం ఉంది.

2: SBI ఇక నుంచి వినియోగదారుల నుంచి ఎసెమ్మెస్ చార్జీలు కూడా వసూలు చేయనుంది.

3: ఇకపై మీరు SBI ఏటీఎం నుంచి రూ.10 వేల కన్నా ఎక్కువ డబ్బు విత్ డ్రా చేస్తే మీరు తప్పుకుండా OTP నెంబర్ ఎంటర్ చేయాల్సిందే. అయితే ఇది కేవలం రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే.

4:SBI తన వినియోగదారులకు మినిమం బ్యాలెన్స్ మెయింటేన్ చేయకపోతే ఎలాంటి చార్జీలు వసూలు చేయదు. SBI తన 44 కోట్ల మంది వినియోగదారుల కోసం ఈ విధానాన్ని అమలు చేస్తోంది.