జగనన్న ఇళ్ళ పధకంలో స్కాం గోడపత్రిక విడుదల

కాకినాడ సిటి: జనసేన పార్టీ ఆధ్వర్యంలో దళిత రక్షణ సమితి నాయకుడు విజయ్ సమక్షంలో పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ జగనన్న ఇళ్ళ పధకంలో స్కాంపై గోడపత్రికను విడుదల చేసారు. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్షలాది ప్రజలకు సొంత ఇళ్ళు కట్టి ఇస్తాం అని ఆర్భాటంగా జగనన్న ఇళ్ళు పధకాన్ని ప్రారంభించారనీ, తీరా ఊళ్ళలో ఉన్న ప్రభుత్వ భూములు సరిపోవనీ ఊరిబయట ప్రయివేట్ భూములు వంద విలువ చేసేవి వై.సి.పి నాయకులే కొని వాటిని లక్షల విలువతో ప్రభుత్వంతో కొనిపించారనీ, పైగా వాటిని ఎత్తుచేయలంటూ తమవాళ్ళకే కాంట్రాక్టులు ఇచ్చి కోట్ల రూపాయలు కొల్లగొట్టారన్నారు. ఈ వ్యవహారం మొత్తం కిందనుండీ పైదాకా అక్రమమే అనీ, గణాంకాలను చూస్తే ఇదే అర్ధమవుతొందనీ, ఈ విషయమై తమ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రధాని మోడీ గారికి లేఖరాస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థలతో నిజా నిజాలని నిగ్గుతేల్చాలని కోరారన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి బండారం త్వరలో బయటపడుతుందని అన్నారు. త్వరలో తాము కాకినాడ సిటిలో జగనన్న ఇళ్ళు పధకంలో జరిగిన అవినీతిమీద సి.ఐ.డి కి లేఖ రాసి విచారణకు కోరుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, దళిత రక్షణ సమితి నాయకుడు విజయ్ మరియు జనసైనికులు కార్తీక్ రాజ్, రాజ్ కుమార్, గౌతం పాల్గొన్నారు.