చిలకం మధుసూదన్ రెడ్డిని కలిసిన పెనుకొండ జనసేన నాయకులు

పెనుకొండ నియోజకవర్గానికి సంబంధించిన జనసేన పార్టీ నాయకులు, ఆ పార్టీ రాష్ట్రప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డిని కలిసి పెనుకొండ నియోజకవర్గ తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించడం జరిగింది. అదేవిధంగా ఈ నెలాఖరులో పెనుగొండ మండలం మరువపల్లి గ్రామంలో జరగబోయే జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చేనేత వికాస విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎర్రి స్వామి చిప్పల పెనుకొండ నాయకులు కుమార్ పెనుకొండ మండల అధ్యక్షులు మహేష్, పెనుకొండ మండల ఉపాధ్యక్షులు మంజునాథ్, సురేష్, నాయకులు హరినాయక్, పెనుగొండ పట్టణ నాయకులు ప్రదీప్, శ్రీనివాస్ తదితరులు పాల్గొనడం జరిగింది.