జనంలోకి జనసేన రెండవ విడత

సనత్ నగర్ నియోజకవర్గం, ఎస్.ఆర్ డివిజన్లో ఆదివారం సనత్ నగర్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి ఎమ్.కావ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో జనంలోకి జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన సిద్ధాంతాలను మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను సనత్ నగర్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి ఎమ్.కావ్య ముదిరాజ్ ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరమహిళలు వెంకటలక్ష్మి, భవాని, పద్మజ, జనసైనికులు హనుమంత్ నాయక్, లోకేష్, రాజ్ కుమార్, అనిల్, నవీన్, బండి హనుమంత్, గణేష్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సనత్ నగర్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి ఎమ్.కావ్య ముదిరాజ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు తెలిపారు.