క్రియాశీలక సభ్యత్వంతో కార్యకర్తల జీవితాలకు భద్రత

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కార్యకర్తల జీవితాలకు ఒక భరోసా, భద్రతనిస్తుంది అని జనసేన పీఏసీ సభ్యులు నాగబాబు అన్నారు. ప్రజా ప్రతినిధులుగా ప్రజా సేవ చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. కార్యకర్తలకు, కార్యకర్తల కుటుంబాలకు ధైర్యం ఇచ్చేందుకు పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపడుతోన్న అద్భుతమైన కార్యక్రమం క్రియాశీలక సభ్యత్వం. కార్యకర్తగా నేనూ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం రెన్యువల్ చేసుకున్నాను. జనసేన పార్టీపై మీకున్న అంకితభావం ఎంత గొప్పదో మీ భద్రత అంత కన్నా విలువైనది. మీ కుటుంబ భరోసా కోసం మీరంతా క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకుంటారని ఆహ్వానిస్తున్నాను. గతంలో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతీ ఒక్కరూ రెన్యువల్ చేసుకోవడానికి, కొత్తగా క్రియాశీలక సభ్యత్వం పొందడానికి ఇంకా రెండు వారాలు సమయం ఉంది. కార్యకర్తల భద్రత గురించి, కార్యకర్త కుటుంబం భరోసా గురించి ఆలోచించిన దాఖలాలు రాజకీయ వ్యవస్థలోనే చాలా అరుదు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు జన సైనికులకు, వీర మహిళలకు ఎలాంటి భద్రత ఇవ్వాలి, వారి కుటుంబాలకు ఏ విధమైన భరోసా ఇవ్వాలనే దాని గురించి ప్రధానంగా ఆలోచిస్తారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, శ్రీ పవన్ కళ్యాణ్ గారి భావజాలం అనుసరించే ప్రతీ ఒక్కరూ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకుంటారని ఆశిస్తున్నానని నాగబాబు పేర్కొన్నారు.