రాజమండ్రి విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్ కు ఘనస్వాగతం

జనసేన, తెలుగుదేశం పార్టీల సమన్వయ కమిటీ తొలి సమావేశం నిమిత్తం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి చేరుకున్నారు. రాజమండ్రి విమానాశ్రయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, పీఏసీ సభ్యులు పితాని బాలకృష్ణ, జిల్లా నాయకులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, అత్తి సత్యనారాయణ, వై. శ్రీను, బత్తుల బలరామకృష్ణ, తుమ్మల బాబు, శెట్టిబత్తుల రాజబాబు, డీఎంఆర్ శేఖర్, టీవీ రామారావు, విడివాడ రామచంద్రరావు, మర్రెడ్డి శ్రీనివాస్, వేగుళ్ళ లీలా కృష్ణ, పోలిశెట్టి చంద్రశేఖర్, బండారు శ్రీనివాస్, తోట సుధీర్, శ్రీమతి పొలసపల్లి సరోజ, ప్రియా సౌజన్య తదితరులు పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారితో పాటు పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ రాజమండ్రి చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మంజీర హోటల్లో జరగనున్న రెండు పార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొంటారు.