మహేష్‌బాబు బర్త్ డే సందర్భంగా నేటినుంచి సేవా కార్యక్రమాలు

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు జన్మదినం సందర్భంగా నేటినుంచి మూడు రోజుల పా టు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సూపర్‌స్టార్‌ కృష్ణ, మహేష్‌ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు కాలేరు శ్రీనివాసరావు, కార్యదర్శి ఎడ్ల నరేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం కాచిగూడ రైల్వేస్టేషన్‌ వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 8,9,10వ తేదీలలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఆస్పత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీ, అనాధ వృద్ధాశ్రమాలలో అన్నదానాలు, మొక్కలు నాటడం, ఆలయాలలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.