ప్రభుత్వ బాలికల వసతి గృహాలలో తీవ్ర మౌలిక సదుపాయాల కొరత

  • విద్యార్థులకు కాస్మోటిక్స్ చార్జీల చెల్లింపు ఉసేలేదు
  • బాలికల వసతి గృహాల ముందు ఆకతాయిల ఆగడాలు అరికట్టేందుకు ప్రభుత్వం ప్రతేక చోరువ తీసుకోవాలి
  • జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత

అనంతపురం: స్థానిక అనంతపురం నగరంలోని ఆదిముర్థి నగర్ లో గల ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని శనివారం జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత సందర్శించి అక్కడి పరిస్థితులను వసతి గృహవిద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వసతి గృహంలో సరైన మౌలిక సదుపాయాలు లేవని అంతేకాకుండా విద్యార్థులకు ప్రతినెలా ఇవ్వవలసిన కాస్మోటిక్ చార్జీలు ఇవ్వడం లేదని, ఇలా అయితే పేద విద్యార్తులపై ఆర్థిక భారం పడి విద్యను మధ్యలోనే వదిలిపెట్టడానికి ఆస్కారం ఉందని, అందువల్ల ప్రభుత్వం ప్రతినెల కాస్మోటిక్స్ చార్జీలు చెల్లించాలని, వీటితోపాటు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవడానికి నెలకు రెండుసార్లు హెల్త్ క్యాంపులు వైద్య నిపుణులతో పెట్టవలసి ఉంటుందని, కానీ ప్రస్తుతం హెల్త్ క్యాంపులు జరగడం లేదు. ప్రభుత్వం ఈ శీతాకాలంలో అయినా హెల్త్ క్యాంపులు విధిగా నిర్వహించి విద్యార్థులు సీజనల్ వ్యాధులకు గురికాకుండా చూసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, వీటితోపాటు ప్రస్తుత ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచి విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, బాలికల వసతి గృహ పరిసర ప్రాంతాలలో ఆకతాయిల ఆగడాలను అరికట్టేందుకు మహిళా పోలీసులతో ప్రత్యేక దృష్టి పెట్టించి వసతిగృహ ఆవరణలో సీ.సీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వీరమహిళలు తదితరులు పాల్గొనడం జరిగింది.