న్యాయానికి సంకెళ్లు – జనసేన, టీడీపీ నాయకుల నిరసన

రాజంపేట: టి.సుండుపల్లి మండల కేంద్రంలో విన్నూత నిరసనకు రాష్ట్ర టీడీపీ ఆదేశాల మేరకు లోకేష్ పిలుపుతో నల్ల రిబ్బన్ల సంకెళ్ళ కార్యక్రమానికి సంఘీభావంగా సుండుపల్లిలో జనసేన పార్టీ తరపున చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ‘న్యాయానికి సంకెళ్లు’ పేరిట టీడీపీ నిరసన చేపట్టడంతో న్యాయానికి ఇంకెన్నాళ్లు సంకెళ్లు అని నినాదాలతో ధర్మ పోరాటానికి మద్దతుగా నిలవాలని లోకేశ్ ఇచ్చిన పిలుపుతో పెద్ద ఎత్తున స్థానిక సుండుపల్లి మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నుంచి వెంటనే విడుదల చేయాలని నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాజంపేట వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఎం దామోదర్ నాయుడు, జనసేనపార్టీ రాజంపేట పార్లమెంటరీ నాయకులు రామ శ్రీనివాస్, టీడీపీ మండల ఉపాధ్యక్షుడు యర్రంరెడ్డి, టీడీపీ శ్రేణులు రామా, ఓవయ్య, గురవయ్య, రామంజులు, రాజా నాయుడు, చెంగల్ రావ్ నాయక్ మరియు జనసేనపార్టీ శ్రేణులు రాజ, రవీంద్ర, భాస్కర్, హరి, జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.