జనసేన పార్టీ ముస్లిం సోదరుల ఆత్మీయ సమావేశం

రాజంపేట, ముస్లిం మైనారిటీల హక్కుల సాధికారం కేవలం జనసేన పార్టీ తోనే సొంతం. ముస్లిం ప్రజల సంక్షేమం కోసం చేతులెత్తేసిన ప్రభుత్వ నిస్సహాయతను ఎండగట్టడం ముస్లిం సోదరులోని అభద్రతా భావాన్ని పోగొట్టి రాబోయే రోజులలో జనసేన పార్టీ ద్వారా చేకూరే లబ్ధిని తెలియపరచడం కోసం నియోజకవర్గాల వారిగా జనసేన పార్టీ ముస్లిం మైనారిటీ సోదరులను ఏకం చేసి రానున్న రోజులలో వాస్తవిక మద్దతును జనసేన పార్టీకి అందించి అధినాయకులు పవన్ కళ్యాణ్ ని విజయం దిశగా నడిపించడం కోసం రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ మరియు రాష్ట్ర కార్యదర్శివర్యులు ముఖరం చాంద్ నడుం బిగించారు. ఇందులో భాగంగా తొలుతగా రాజంపేట నియోజకవర్గంలోని లోకల్ మైనారిటీ జనసైనికులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.