జనసైనికుని పరామర్శించిన నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టి బత్తుల

కోనసీమ జిల్లా: మండపేటలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్న రైతు భరోసా యాత్ర సభకు వెళ్ళిన జనసైనికులలో అమలాపురం నియోజక వర్గం, అల్లవరం మండలం, కొమరగిరిపట్నం కు చెందిన బండారు సాయి అనే జనసైనికుడికి మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో అరి చేయి విరిగిపోయింది. విషయం తెలుసుకొన్న జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ శెట్టిబత్తుల రాజబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు పలువురు సాయిని పరామర్సించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సందాడి శ్రీనుబాబు జిల్లా కార్యదర్శి చిక్కాల సతీష్, జనసేన పార్టీ నాయకులు కంకిపాటీ వీరబాబు, కటికరెడ్డి బాబి, నల్ల రాము, మద్దాల నాగబాబు, పిండి గణపయ్య కంకిపాటి సుబ్బన్న, చేవల వెంకటేశ్వరరావు, చికిలే చిట్టిబాబు, కొమరగిరిపట్నం జన సైనికులు పాల్గొన్నారు.