వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి: ఎంపీటీసీ అనురాధ డిమాండ్..

రాయవరం: రాయవరం మండలం చెల్లూరు గ్రామ పరిధిలో కోరంగి కాలువ ఎడమ గట్టు కొంత మేర కోతకు గురై.. పై నుండి నీరు పొర్లి ప్రక్కన వున్న నాట్లు వేసిన పొలాల్లో చేరి పొలాలు మునిగినవి. కాలువ గట్టు అక్కిలేరు దగ్గరలో పై నుండి పొర్లి గండి పడే అవకాశం వుంది అని ఈ విషయంపై చెల్లూరు గ్రామ జనసైనికులు ఇరిగేషన్ ఏ.ఈ ని ఫోన్ ద్వారా సంప్రదించగా వాటర్ ఫ్లో తగ్గించాము. వాటర్ లెవెల్ తగ్గిన వెంటనే ఇసుక బస్తాలు వేసి గండి పడకుండా చేస్తాము అని చెప్పారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ -1 గొల్లపల్లి అనురాధ గారు మాట్లాడుతూ.. వరదల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వమే పూర్తి సహాయం చేయాలని డిమాండ్ చేసారు.