పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని అజ్మీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు

  • శ్రీశ్రీశ్రీ సయ్యద్ హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ గరిబ్ నవాజ్ అజ్మీర్ దర్గాలో ప్రత్యేక పార్ధనలు నిర్వహించిన షేక్ మహబూబ్

ఆత్మకూరు: భారత్ దేశంలో ప్రసిద్ధి గాంచిన రాజస్థాన్ లో ఉన్న శ్రీశ్రీశ్రీ సయ్యద్ హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ గరిబ్ నవాజ్ అజ్మీర్ దర్గా 811 ఉరుస్ (గంధం) సందర్భంగా ఆదివారం అనంత సాగరం మండల జనసేన అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించి ప్రత్యేక ఫాతేహా (పూజ) చేసి ఆంధ్రరాష్ట్రం అభివృద్ధి చెందాలని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుండాలని. 2024 ఎలక్షన్ లో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ముఖ్య మంత్రి అవ్వాలని దర్గా వద్ద ప్రత్యేక దువ్వ (ప్రార్దనలు) చేయడం జరగింది. ఈ కార్యక్రమాలో కుటుంబ సభ్యులతో పాటు జనసేన మండల సంయుక్త కార్యదర్శి షేక్ ఖాజా మస్తాన్ పాల్గొనడం జరిగింది.