అంగన్వాడీల సమ్మెకు షేక్ మహబూబ్ మస్తాన్ మద్దతు

ఆత్మకూరు: అంగన్వాడీల సమ్మెకు అనంత సాగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్ మద్దతు తెలిపారు. గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో అంగన్వాడి ఉద్యోగులకు చాలా హామీలు ఇచ్చి, దాదాపు ఐదేళ్లు కావస్తున్నా ఇచ్చిన హామీలను నేటికీ నెరవేర్చకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలంతా సమ్మె నిర్వహించారు. స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం వద్ద తలపెట్టిన అంగన్వాడీలకు సమ్మెకు అనంత సాగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్ పాల్గొని సంఘీభావం తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ నేటి రోజుల్లో పేద ధనిక వర్గాల వారందరికీ పోషణ లోపం లేకుండా చూడటంలో అంగన్వాడీల పాత్ర ఎంతో కీలకమైనదని, అంతేకాకుండా ఒక స్త్రీ తన బిడ్డకు జన్మనివ్వడంతో ప్రారంభిస్తూ ఆ తల్లి, బిడ్డల సంరక్షణ ధ్యేయంగా ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా కాపాడుకుంటూ అంగన్వాడీ టీచర్ వస్తున్నారని, అంగన్వాడీల సేవలను కొనియాడారు. ముఖ్యమంత్రి అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను సత్వరమే అమలు చేసి వారి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని జనసేన పార్టీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల నాయకులు, మిట్ట మల్ల పెంచలయ్య, పెనగాలురుచి సీపీఎం మండల కార్యదర్శి అన్వర్ అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.