జనసైనికుడు గాది కృష్ణను పరామర్శించిన మాకినీడి శేషు కుమారి

గొల్లప్రోలు మండలం, చిన్న జగ్గంపేట గ్రామానికి చెందిన జనసైనికుడు గాది కృష్ణ ఇటీవల పి. దొంతమూరు నుంచి చిన్న జగ్గంపేట వస్తుంటే మార్గమధ్యలో దొంతమూరు బ్రిడ్జి పై నుంచి కిందకి పడి ప్రమాదానికి గురై, కాకినాడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పిఠాపురం జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ శ్రీమతి మాకినీడి శేషు కుమారి హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించి.. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, అన్నివిధాలుగా అండగా ఉంటానని చెప్పి, డాక్టర్ తో మాట్లాడి భోరోసా ని కల్పించారు. ఈ కార్యక్రమంలో.. జిల్లా కార్యదర్శి మొగిలి అప్పారావు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.