ఏలూరు నియోజకవర్గంలో భోగి పండుగ సంబరాలు

పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు నియోజకవర్గం, తూర్పు వీధిలోని శివయ్య గుడి వద్ద జరిగిన సంక్రాంతి సంబరాల్లో భాగంగా “భోగి పండుగ సంబరాలు” పశ్చిమగోదావరి జిల్లా సంయుక్త కార్యనిర్వహక కార్యదర్శి “ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా” ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఏలూరు ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతి కుమార్, డివిజన్ పెద్దలు మద్దుల సత్యకుమార్, గుగ్గిలం రాము, కనిగొళ్ళ రాజేష్, బూర్లగడ్డ భద్రం, మాడ సుబ్బారావు, చలువాది కృష్ణ, మద్దుల సురేంద్ర, కురెళ్ళ భాస్కర్, అంబికా నాని తదితరులు పాల్గొన్నారు.