బూత్ కమిటీ శిక్షణా తరగతులు నిర్వహించిన శిరీష పొన్నూరు

తెలంగాణ, ఎల్.బి.నగర్, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎల్బినగర్ నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలుపే లక్ష్యంగా నియోజకవర్గ ఇంఛార్జి శ్రీమతి సాయి శిరీష పొన్నూరు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా బూత్ అధ్యక్షులకు శిక్షణా తరగతులు ఆదివారం సాయంత్రం నిర్వహించారు. బూత్ అధ్యక్షులకు ఎన్నికల రోజున వారు నిర్వహించాల్సిన కర్తవ్యాన్ని దిశా నిర్దేశించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.