ప్రభాస్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన శ్రద్ధా కపూర్..

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన మూడో విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమo విజయవంతంగా  కొనసాగుతుంది. దీనిలో పాల్గొని మొక్కలు నాటడానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని, ఇందుకు శ్రీకారం చుట్టిన సంతోష్ కుమార్ కు అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ‘బాహుబలి’, ‘రెబల్ స్టార్’ ప్రభాస్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి ఈరోజు బొంబాయిలోని తన నివాసంలో మొక్కలు నాటి ఈ విషయాన్ని తన సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకెళ్తున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు శ్రద్ధా కపూర్.