బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్ కు సింధు, శ్రీకాంత్

గత ఏడాది చైనా వేదికగా జరుగాల్సిన బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ టోర్నీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌ అర్హత సాధించారు. ఈ నెల 27 నుంచి 31 వరకు ఈ టోర్నీ థాయ్‌లాండ్‌లో జరుగనుంది.

టొయోటా థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో సెమీస్‌ చేరిన భారత పురుషుల డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌శెట్టి, మిక్స్‌డ్‌ డబుల్స్‌ ద్వయం సాత్విక్‌-అశ్వినీ పొన్నప్పుకు టూర్‌ ఫైనల్స్‌లో చోటు దక్కలేదు. కరోనా ఆందోళనతో జపాన్‌, చైనా షట్లర్లు దూరమవడంతో 14వ ర్యాంకులో ఉన్న శ్రీకాంత్‌ కు అవకాశం దక్కింది.