చలివేంద్రం ద్వారా మజ్జిగ పంపిణీ చేసిన సింగరాయకొండ జనసేన

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు.. ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ సలహాల మేరకు.. సింగరాయకొండ ట్రంక్ రోడ్డు లోనీ జనసేన పార్టీ అధ్వరంలో ఏర్పాటుచేసిన చలివేంద్రంలో ఆదివారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగినది. చలివేంద్రం ఏర్పాటు చేసి ఆరువారాలు పూర్తి చేసుకొని.. వేసవికాలంలో దాహార్తి తీర్చడానికి ప్రతీ రోజు చల్లని మినరల్ వాటర్, మరియు ప్రతి ఆదివారం చల్లని మజ్జిగ ప్రయాణికులకు, బాటసారులకు, యచకులకు మరియు ప్రజలకు జనసేన పార్టీ తరుపున అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్, జరుగుమల్లి మండల అధ్యక్షులు శశి భూషణ్, మాలాద్రి నాయుడు, చిన్న నాయుడు, దండే ఆంజనేయులు, కాసుల శ్రీనివాస్, దేవినేని బాలాజీ, అనుమల శెట్టి కిరణ్ బాబు, గుంటుపల్లి శ్రీనివాసులు, షేక్ చాన్ బాషా, పోలిశెట్టి విజయ్ కుమార్, షేక్ మా భాష, సంకే నాగరాజు, మాక వెంకటేశ్వర్లు, షేక్ షబ్బీర్ భాష, షేక్ సుల్తాన్ బాషా, చలంచర్ల కరుణ్ కుమార్, షరీఫ్, షేక్ షన్ను నామ మహేష్, మరియు జనసైనికులు పాల్గొన్నారు.