సిబిఐ దత్తపుత్రుడికి జనసేన సవాల్ గోడప్రతులు ఆవిష్కరించిన పామర్రు జనసేన

కృష్ణా జిల్లా, పామర్రు నియోజకవర్గం, సిబిఐ దత్త పుత్రుడికి జనసేన సవాల్, ఎన్నారై జనసైనికులు రాజా మైలవరపు టీం పిడికిలి వారు వితరణ చేసిన, జనసేన పార్టీ యొక్క రైతు భరోసా యాత్ర గూర్చి మరియు రైతులు పండించిన పంటకు లాభసాటి ధర గూర్చిన ఆటో స్టికర్లు మరియు గోడ ప్రతులు అధ్యక్షుల వారి కృష్ణా జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు పచ్చిగళ్ళ సుధీర్ బాబు ఆధ్వర్యంలో స్థానిక నియోజకవర్గం పార్టీ కార్యాలయం నందు, నియోజకవర్గం ఇంచార్జి తాడిశెట్టి నరేష్ చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మరణించిన కౌలు రైతుల కుటుంబాలను జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదుకుంటుంటే, ప్రభుత్వం ఎందుకు ఉలిక్కి పడుతుంది. మేము సహాయం చేస్తున్న వారు కౌలు రైతులు కాదని వైసీపీ నాయకులకు, సిబిఐ దత్త పుత్రుడికి నిరూపించే దమ్ముందా అని సవాల్ విసిరారు. కార్యక్రమంలో రాపర్ల ఎంపీటీసీ కూనపరెడ్డి సుబ్బారావు, నియోజకవర్గం చిరంజీవి యువత అధ్యక్షులు పంచకర్ల సందీప్, ఎర్రంశెట్టి వీరాస్వామి మరియు జనసైనికులు పాల్గొన్నారు.