సచివాలయాల్లో సోషల్ ఆడిట్ కార్యక్రమం

విజయావాడ ఈస్ట్: జగనన్న ఇళ్లు పేదల కన్నీళ్లు . జగనన్న మోసం. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించిన ఈ కార్యక్రమంలో భాగంగా 7వ డివిజన్ లో ఉన్నటువంటి వార్డు సచివాలయాల్లో సోషల్ ఆడిట్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా డివిజన్ సచివాలయ వి.ఆర్.ఓ ని కలిసి వినతి పత్రాన్ని అందజేసి 7వ డివిజన్ పరిధిలో జగనన్న ఇళ్లు ఎంతమందికి కేటాయించారు? లబ్ధిదారుల సంఖ్య? ఎంతమందికి పట్టాలు అందజేశారు?.జగనన్న కాలనీలోఇళ్లు ఎప్పటికీ పూర్తవుతాయి? మొదలగు అంశాల మీద జనసేన పార్టీ తరఫున వివరణ కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గం జనసేన డివిజన్ అధ్యక్షులు శ్రీమతి అనిత పోతిరెడ్డి, శ్రీమతి పాశం సుజాత, దోమకొండ అశోక్, పోతిరెడ్డి రమణ, వి. హరి ప్రసాద్, రామాయణపు కోటి, యడ్లపల్లి శివ నాగరాజు, ముత్యాల కృష్ణ, తోట శ్రీను, ప్రదీప్, విజయ్ పాల్గొనడం జరిగింది.