తుమ్మి లక్ష్మీ రాజ్ ను సత్కరించిన జనసైనికులు

విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ జనసైనికులు, జనసేన వీరమహిళా విభాగం కమిటీలో విజయనగరం జిల్లా నుంచి తుమ్మి లక్ష్మీ రాజ్ నియమితులు కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జనసేన రాష్ట్ర జిల్లా నాయకులు సమక్షంలో గౌరవంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాలవలస యశస్వి జనసేన పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ, విజయనగరం వీరమహిళ పద్మశ్రీ దాస్, నెల్లిమర్ల నియోజకవర్గ నాయుకులు, బుర్లే విజయ్ శంకర్, పతివాడ అచుంనాయుడు, దిండి రామారావు, పిన్నింటి రాజారావు, తోత్తడి సూర్యప్రకాష్, విజయనగరం నియోజకవర్గ నాయకులు మీడతన రవి ప్రసాద్, రవితేజ, చక్రవర్తి మరియు జనసైనికులు పాల్గొన్నారు.