విజయనగరం జనసేన పార్టీలో చేరికలు

విజయనగరం జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా రెల్లి కులాల సంక్షేమ సంఘం సిటీ మహిళా అధ్యక్షురాలు సోమాదుల ఆదిలక్ష్మి మరియు జిల్లా సంఘం సభ్యులు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆదిలక్ష్మి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి పార్టీలో జాయిన్ అయ్యానని రాబోయే రోజుల్లో మరింత మంది జనసేన పార్టీలో చేరుతారని ప్రతి ఒక్కరూ జనసేన టిడిపిలో గెలుపుకు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గంట్లాన పుష్ప, చక్రవర్తి, కొర్నాన రామకృష్ణ, బొబ్బాధి చంద్రనాయుడు, ముత్యాల నాయుడు, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.