ఘంటసాల కుమారుడు, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ రత్నకుమార్‌ కన్నుమూత

ప్రముఖ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు రెండో కుమారుడు, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌, రచయిత రత్నకుమార్‌ తుదిశ్వాస విడిచారు. గత కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధింత సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. ఘంటసాలకు ఆరుగురు సంతానం కాగా, రత్నకుమార్‌ రెండోవాడు. తన సోదరీసోదరుల్లో సినిమా ఇండిస్టీలోకి తాను తప్ప ఇంకెవ్వరూ రాలేదని గతంలో ఆయన చెప్పారు. ఆయన కుమార్తె వీణ అందాల రాక్షసి, టెంపర్‌, క్రిష్ణ అండ్‌ హిజ్‌ లీలా చిత్రాల్లో పాడారు. 30 ఏళ్ల పాటు చిత్రపరిశ్రమలో ఉన్న ఆయన అర్జున్‌, కార్తీక్‌, అరవింద్‌ స్వామి, షారుక్‌, సల్మాన్‌ఖాన్‌లకు గాత్రదానం చేశారు. ఇప్పటి వరకు సుమారు 1100 చిత్రాలకు డబ్బింగ్‌ చెప్పారు. తెలుగు, తమిళ్‌, మలయాళం, హిందీ భాషల్లో డబ్బింగ్‌ చెప్పారు. జెమిని టీవిలో వచ్చిన విశ్వ దర్శనం ప్రోగ్రామ్‌కు యాంకర్‌గా పనిచేశారు.