Million ఫాలోవర్స్ ను సంపాదించుకున్న సోనుసూద్

కరోనా సమయంలో ఎంతో మంది పేద ప్రజలకు వలస కార్మికులకు అండగా నిలబడ్డాడు బాలీవుడ్ నటుడు సోను సూద్. సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ప్రాణదాతగా నిలిచాడు. దీనితో సూనుసూద్ పై అభిమానంతో చాలా మంది గుడిలు కూడా కట్టారు. అయితే ఇంత చేసినా సోనుసూద్ పై ఐటి దాడులు జరగడాన్ని ఆయన ఫాన్స్ తప్పుబట్టారు. అలాగే తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా సోనూ కు తాము అండగా ఉంటామని అతను రాజకీయాల్లోకి వస్తాడనే భయంతో కొందరు ఆడుతున్న నాటకమని చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఇలా ఉండగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సోనూసూద్ కు రోజురోజుకి ఫాలోయింగ్ పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఏకంగా కోటి మంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్నాడు సోనూసూద్.