ముదినేపల్లి 2 ఎంపీటీసీ ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో పాల్గొన్న బీజేపి, జనసేన నాయకులు

కృష్ణాజిల్లా, కైకలూరు నియోజకవర్గం, 16వ తేదీన జరిగే ఎంపిటిసి ఎన్నికలకు ముదినేపల్లి మండలం అన్నవరంలో బీజేపి, జనసేన నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు. Dr. B R అంబెడ్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ప్రచారం ప్రారంభించిన బీజేపీ మరియు జనసేన పార్టీ బలపరిచిన ఉమ్మడి ఎంపిటిసి అభ్యర్ధి మీసాల సత్యనారాయణ. ఆయనతో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి కోటప్రోలు కృష్ణ, జిల్లా కార్యదర్శి గాజుల సిద్దార్థ్ కుమార్, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు సత్యవోలు నాగలక్ష్మి, SC సెల్ జిల్లా ఉపాధ్యక్షడు మొవ్వ ఫణి, జనసేన నాయకులు వేల్పురి నానాజీ, అంబుల భారత్, తనుకుల రవి తేజ, సత్యవోలు గణేష్, మల్లంపల్లి వీరబాబు, రేమల్లే దుర్గ ప్రసాద్ తదితరుల పాల్గొన్నారు.