వారాహీ ప్రజాక్షేమ యాత్ర విజయవంతం కావాలి: బొలిశెట్టి శ్రీనివాస్

  • ముదునూరు గ్రామంలో వేంచేసియున్న ఆంజనేయస్వామి గుడిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు

తాడేపల్లిగూడెం: జనసేన ఎన్నికల ప్రచార వాహనం కొండగట్టు అంజన్న సన్నిధిలో జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ తో వారాహి కి ప్రత్యేక పూజలు సందర్భంగా వారహియాత్ర ద్విగిజయంగా జరగాలని తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ మరియు పెంటపాడు మండలం ముదునూరు మరియు ఆకుతీకిపాడు గ్రామ జనసేన పార్టీ జనసేన నాయకులు, జన సైనికులు, జనసేన వీర మహిళల ఆధ్వర్యంలో ముదునూరు గ్రామం దగ్గర వేంచేసియున్న ఆంజనేయస్వామి గుడిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ మా అధ్యక్షులు మంగళవారం కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో వారాహి వాహనం పూజ చేయించి ప్రజా క్షేత్రంలోకి రాబోతున్నారు. మన ఆంధ్రప్రధేశ్ లో ఈ వైసీపి దుర్మార్గపు, దౌర్ధన్య, ఆక్రమణ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ఆయన చేపట్టబోయే వారాహీ ప్రజాక్షేమ యాత్ర విజయవంతం అవ్వాలని, రాబోయే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలలో మా అధినేత పవన్ కళ్యాణ్ మరియు మా నాయకులకి ప్రజలు బ్రహ్మరథంపట్టి మా జనసేనపార్టీ అభ్యర్ధులను అత్యధిక మెజారిటితో గెలిపించి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి అవ్వడానికి ప్రజల ఆశీస్సులు ఉండాలని, అలాగే ఆయన తలపెట్టిన ప్రతీ కార్యక్రమం విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెంటపాడు మండలం జనసేన నాయకులు మరియు తాడేపల్లిగూడెం జనసేన నాయకులు, జనసైనికులు, జనసేన వీర మహిళలు పాల్గొన్నారు.