జనసేనాని త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తో అస్వస్థతకు గురై హాస్పెటల్లో వైద్యం చేయించుకుంటున్న విషయం విధితమే. పవన్ కళ్యాణ్ వేగముగా కోలుకోవాలని మరల ప్రజలలోకి వచ్చి ఎప్పటిలాగే ప్రజల పక్షాన నిలిచి, ప్రజా సమస్యలమీద పోరాటం చేయాలని శుక్రవారం సాయంత్రం 07:00 గంటలకు లావేరు గ్రామము మెయిన్ రోడ్లో గల శ్రీ ఉమా మల్లికార్జున స్వామి స్వయంభూ దేవస్థానంలో స్వామి వారికి అభిషేకం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో దోర రాజా రమేష్, కొమ్మూరు శ్రీను, ప్రేమకుమార్ (పండు), చిన్ని, కృష్ణ, శేఖర్, సాయి, వెంకటేష్, ప్రసన్న, గణేష్ మరియు ప్రసాద్ పాల్గొన్నారు.