అతికారి దినేష్ కోలుకోవాలని గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు

రాజంపేట నియోజక వర్గం: జనసేన పార్టీ యువ నాయకులు అతికారి దినేష్ గత వారం రోజులుగా విష జ్వరంతో అస్వస్థతకు గురైనారు. ఆయన త్వరగా కోలుకోవాలని రాజంపేట జనసైనికుల ఆధ్వర్యంలో సానిపాయి శ్రీ శ్రీ శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గుగ్గిళ్ళ నాగర్జన, కొట్టే శ్రీహరి, జగిలి ఓబులేసు, గుగ్గిళ్ళ వెంకీ, యెద్దుల నరసింహా, నేతి వెంకటేష్, అమరశసాని అర్జున కుమార్, గుగ్గిళ్ళ రెడ్డయ్య, సిద్ద నాగయ్య, సుబ్బయ్య, వై వెంకటయ్య, జి వెంకటయ్య, సురేష్,చంద్ర, మనోహర్, ప్రసాద్, జి వెంకటరమణ, పైడి శంకర, జనసేన వీరమహిళలు రేణుకమ్మ, ఇందిరమ్మ జనసైనికులు విచ్చేశారు.