వారాహియాత్ర విజయవంతం కావాలని పొన్నలూరులో ప్రత్యేక పూజలు

  • 2024లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు- కనపర్తి మనోజ్ కుమార్

కొండెపి నియోజకవర్గం: పొన్నలూరు మండలంలో జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో వారాహియాత్ర విజయవంతం అవ్వాలని ఆంజనేయస్వామి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కనపర్తి మనోజ్ కుమార్ మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించి ఆంధ్రరాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు. రాష్ట్రంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా పొన్నలూరు మండలంలో వైసీపీ ప్రభుత్వం అరాచకాలు అన్యాయాలు దోపిడీ దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయి, మండలం యొక్క అభివృద్ధిని మరిచిపోయి జేబులు నింపుకునే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జనసేన ప్రభుత్వం రాగానే ఆదర్శవంతమైన మండలంగా తీర్చిదిద్దుతాను, ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించి పవన్ కళ్యాణ్ గారికి ఒక్క అవకాశం ఇవ్వండి అని పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం నాయుడు, మహబూబ్ బాషా, సుంకేశ్వరం శ్రీను, ఆంజనేయులు, మహేష్, నాగరాజు, కోటేశ్వరరావు, సాయి, ఖాదర్ బాషా, పీటర్ బాబు, పెయ్యల రవి, తిరుమల్ రెడ్డి, భార్గవ్, గూడపాటి వేణు, రంప తోటి ప్రసాద్, రంపతోటి గోపి, మనోజ్, పోలయ్య, బద్రి, ప్రకాష్, నాగేంద్రబాబు, శివ, కిరణ్, వెంకట్రావు, సుమన్, ఇమ్మానియేల్, రంజిత్, బాలాజీ, నాగరాజు, చెన్నరాజు, అజిత్ కుమార్, నాని, హజరతయ్యా, వెంగళరావు, వేణు, శరత్, ఆదికేశవులు, చొప్పర మధు, పొనుగోటి మధు, గోపి, దినేష్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.