జీలుగుమిల్లిలో జగదాంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు

పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లిలో శనివారం జగదాంబ అమ్మవారి ఆలయంలో ఇంచార్జ్‌ చిర్రి బాలరాజు, మండల అద్యక్షులు పసుపులేటి రాము పూజలు నిర్వహించడం జరిగింది. గత నాలుగు రోజుల క్రితం జనసేన పార్టీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కోటికలపూడి గోవింద్ కోవిడ్ బారినపడి అనారోగ్యానికి గురయ్యారు, వారు ఆయురారోగ్యాలతో ఉండాలని మరల తిరిగి పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా నడిపించాలని ఆయనను పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించినప్పటి నుండి పార్టీని నియోజకవర్గాల్లో మరింత బలోపేతానికి అభివృద్ధికి ఆయన కార్యక్రమాలు ఎంతగానో దోహదపడ్డాయి ఇలాంటి మంచి నాయకుడికి ఇలా జరగటం చాలా బాధాకరం వెంటనే ఆయన కోలుకోవాలని పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు.