వారాహి యాత్ర విజయవంతం కోసం గోరంట్ల జనసేన ప్రత్యేక పూజలు

పెనుగొండ నియోజకవర్గం: గోరంట్ల మండలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న వారాహి యాత్ర విజయవంతం కావాలని గోరంట్ల మరువ ఆంజనేయ స్వామి దేవాలయంలో గోరంట్ల మండలం జనసేన పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ చేపట్టబోతున్న వారాహి యాత్ర జూన్ 14న మొదలు కాబోతున్న సందర్భంగా ఈ యాత్ర విజయవంతం కావాలని సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని మరువ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో పెద్ద ఎత్తున పూజలు, అర్చనలు చేసి గుడి బయట జనసేన నాయకులు కొబ్బరికాయల సమర్పణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆంద్రప్రదేశ్ లో ప్రస్తుతం అరాచక పాలన కొనసాగుతోంది. ఈ నాలుగేళ్ళ సమయంలో ఆంద్రప్రదేశ్ లో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, ఆంద్రప్రదేశ్ కాస్త అప్పుల ప్రదేశ్ గా మారిపోయిందని, వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారు అని ప్రస్తుతం ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అది కేవలం పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యం అవుతుందని పవన్ కళ్యాణ్ కి ఒక్క చాన్స్ ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఈ వారాహి యాత్రతో ఆంద్రప్రదేశ్ లో సరికొత్త అధ్యాయనికి పవన్ కళ్యాణ్ నాంది పలకబోతున్నారని, ప్రజలు ఈ యాత్ర కి బ్రహ్మారథం పట్టబొతారని వారు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సురేష్ జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్ గోరంట్ల మండల అధ్యక్షుడు సంతోష్, పెనుకొండ నియోజకవర్గ ఐటి కో ఆర్డినేటర్ యోగనందరెడ్డి, నియోజకవర్గ నాయకులు అనిల్ కుమార్, మండల నాయకులు నాగేంద్ర, రాఘవేంద్ర, నరేష్, శ్రీనివాసులు, తిరుపల్, నరేంద్ర, ఆంజనేయులు బాలు, రవి. మునింద్ర, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.