అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పలువురిని పరామర్శించిన పితాని

ముమ్మిడివరం నియోజకవర్గం: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పలువురిని జనసేన పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ బుధవారం పరామర్శించారు. ఐ పోలవరం మండలం, పశువుల్లంక గ్రామానికి చెందిన ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడిన సలాది సతీష్ ను, మురమళ్ల కొత్త కాలనీకు చెందిన ఇటీవల మరణించిన గొర్రెల మన్యం (కొండ) కుటుంబ సభ్యులను, అదేవిధంగా గుత్తిని దీవి గ్రామానికి చెందిన ఇటీవల మృతిచెందిన గాలి చిట్టిబాబు కుటుంబ సభ్యులను, గుత్తెనదీవి గ్రామానికి చెందిన ఇటీవల మరణించిన సాధనాల సన్యాసిరావు (బాబురావు) కుటుంబ సభ్యులను, జి. వేమవరం గ్రామానికి చెందిన ఇటీవల మరణించిన రాయపు రెడ్డి సత్యనారాయణ కుటుంబ సభ్యులను మరియు జి.వేమవరం గ్రామానికి చెందిన ఇటీవల మరణించిన నల్లా అన్నవరం కుటుంబ సభ్యులను జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ దాని బాలకృష్ణ పరామర్శించి ఓదార్చారు.